AP: 63.87 లక్షల మందికి రూ.1,759.99 కోట్లు 

1 Feb, 2023 08:22 IST|Sakshi

నేటినుంచి వలంటీర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ  

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 63,87,275 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి సామాజిక పింఛన్ల రూపంలో రూ.1,759.99 కోట్లను పంపిణీ చేయనుంది.

ఈ మొత్తాన్ని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. బుధవారం తెల్లవారుజాము నుం­చే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఒకటో తేదీ నుంచి ఐదురోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.   

మరిన్ని వార్తలు