సాక్షి, తిరుపతి: భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో 22 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. బళ్లారి నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ కి గుండెనొప్పి రావటంతో బస్సు అదుపు తప్పిందని సమాచారం.