సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గుడిసేవ శ్యామ్ప్రసాద్ శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ హైపవర్ కమిటీ చైర్మన్గా ఇటీవల నియమితులై, బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ శ్యామ్ప్రసాద్ సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.