అమ్మఒడిపై లఘు చిత్రం ఆవిష్కరణ

24 Aug, 2021 08:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి పథకంపై నిర్మాత చుండూరు సుందర రామశర్మ నిర్మించిన లఘు చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు