మైనార్టీలు లేకుండా వైఎస్‌ఆర్‌సీపీ లేదు: సజ్జల

2 Feb, 2023 14:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు సీఎం జగన్‌ అందిస్తున్నారన్నారు. తాడేపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన మైనార్టీ సదస్సులో సజ్జల మాట్లాడుతూ.. డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హామీలకు పరిమితమైందన్న సజ్జల ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్‌ అమలు చేశారని ప్రస్తావించారు.

ముస్లిం మైనార్టీలకు ఆనాడు వైఎస్సార్‌ న్యాయ చేశారని.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ న్యాయం చేశారని గు​ర్తు చేశారు. అన్ని పథకాల్లోనూ మైనార్టీలకు ప్రాధాన్యతనిచ్చామని పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులు చదువుకునే స్కూళ్లను అభివృద్ధిచేశారని చెప్పారు. మైనార్టీలు లేకుండా వైఎస్సార్‌సీపీ లేదని అన్నారు.
చదవండి: కోటంరెడ్డి ఆరోపణలు.. పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

మరిన్ని వార్తలు