ఏపీ సెక్రటేరియట్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

12 Jan, 2023 18:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ సెక్రటేరియట్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగవళ్లులు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ఉద్యోగులు సంబరాలు జరిపారు. ఎద్దులబండి, గంగిరెద్దుల విన్యాసాలు, కత్తిసాము ప్రదర్శనలు అలరించాయి.

మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, మేరుగ నాగార్జున ఈ సంబరాల్లో పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులకు మంత్రులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి  మేరుగ నాగార్జున మాట్లాడుతూ, సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.


చదవండి: తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై ఈవో ధర్మారెడ్డి క్లారిటీ

మరిన్ని వార్తలు