పీఎస్‌ఎల్‌వీ– సీ53 ప్రయోగానికి ‘షార్‌’ సిద్ధం

20 Feb, 2022 04:33 IST|Sakshi

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలో రెండో ప్రయోగానికి సిద్ధమవుతోంది. కరోనా పూర్తిగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రయోగాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో పీఎస్‌ఎల్‌వీ–సీ53 ప్రయోగం ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ ప్రయోగంలో ఈవోఎస్‌ (అకా ఓషన్‌శాట్‌–3) అనే ఉపగ్రహంతో పాటు మరో 5 చిన్న ఉపగ్రహాలను పంపనున్నారు.

ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ప్రయోగాన్ని మార్చి 15న ప్రయోగాత్మకంగా నిర్వహించి నిర్థారించుకున్న తరువాత మార్చి 25 నుంచి 31 లోపు ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాన్ని కూడా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 

మరిన్ని వార్తలు