నిబంధనల ప్రకారమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

3 Apr, 2021 15:21 IST|Sakshi

ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరిన ఎస్‌ఈసీ

సాక్షి, అమరావతి: హైకోర్టులో ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని.. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది నోటిఫికేషన్‌ ప్రకారంగా ఎన్నికల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రిట్ అప్పీల్‌ను డిస్మిస్‌ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎస్‌ఈసీ కోరారు.
చదవండి:
ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్
జెండా ఎత్తేసిన చంద్రబాబు

మరిన్ని వార్తలు