టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా శోభారాజు నియామకం

1 Oct, 2020 03:33 IST|Sakshi

సాక్షి, అమరావతి/ తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా పద్మశ్రీ డాక్టర్‌ శోభారాజును నియమిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. గతేడాది టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు శోభారాజును ఎంపికచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంగీత కళాకారిణిగా అన్నమయ్య పాటలకు ప్రాచుర్యాన్ని తీసుకురావడంలో ఆమె కృషి ఎనలేనిది. 

మరిన్ని వార్తలు