సాక్షి, వైఎస్సార్, కడప : రాజంపేట మండలం రోళ్ళమడుగు సమీపంలో మాడికాయల లోడుతో వెళుతున్న ఇశ్చర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటీ అమరనాథ్ రెడ్డి వాహనాలలో ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న నలుగురిని కడప రిమ్స్కు తరలించారు.