‘యాస్‌’ తుపాన్‌ కారణంగా మరికొన్ని రైళ్లు రద్దు

24 May, 2021 03:39 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ‘యాస్‌’ తుపాన్‌ కారణంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ తాజాగా విజయవాడ మీదుగా నడిచే మరికొన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన రైళ్ల వివరాలివీ.. 

ఈ నెల 23వ తేదీ: భువనేశ్వర్‌–బెంగళూరు ప్రత్యేక రైలు (02845)
24వ తేదీ: హౌరా–వాస్కోడిగామ (08047/08048) 
27వ తేదీ: తిరువనంతపురం–షాలీమార్‌ (02641), హౌరా–తిరుచిరాపల్లి (02663), చెన్నై సెంట్రల్‌–సంత్రగచ్చి (02808), యశ్వంత్‌పూర్‌–హౌరా (06597) 
28వ తేదీ: పురులియా–విల్లుపురం (06169), హౌరా–మైసూర్‌ (08117) 
29వ తేదీ: తాంబరం–జసిది జంక్షన్‌ (02375), కన్యాకుమారి–హౌరా (02666), హౌరా–యర్నాకులం (02877), 
30వ తేదీ: హౌరా–పుదిచ్చేరి (02867)  

>
మరిన్ని వార్తలు