సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ రద్దీని మరింత తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి విజయవాడ మీదుగా నర్సాపూర్, కాకినాడ టౌన్, తిరుపతి మధ్య మరో 16 ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నారు.
జనవరి 7న తిరుపతి–వికారాబాద్ (07050), 8న వికారాబాద్–కాకినాడ టౌన్ (07051), 9న కాకినాడ టౌన్–కాచిగూడ (07057), 10న కాచిగూడ–తిరుపతి (07058), 11న తిరుపతి–వికారాబాద్ (07070), 12న వికారాబాద్– నర్సాపూర్ (07071), 13న నర్సాపూర్–కాచిగూడ (07072), 14న కాచిగూడ–తిరుపతి (07073), 12న హైదరాబాద్–తిరుపతి (07083), 13న తిరుపతి–హైదరాబాద్ (07084), 14న హైదరాబాద్–నర్సాపూర్ (07085), 15న నర్సాపూర్–హైదరాబాద్ (07086), తిరుపతి–వికారాబాద్ (07079), 16న వికారాబాద్–నర్సాపూర్ (07080), 17న నర్సాపూర్–కాచిగూడ (07081), జనవరి 18న కాచిగూడ తిరుపతి (07082) నడపనున్నారు.