రేపు పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలనకు సజ్జల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం

29 Jun, 2021 21:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని 10 మంది సభ్యుల బృందం రేపు పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలనకు బయల్దేరనుంది. బృందంలో ప్రభుత్వ చీఫ్ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
చదవండి: కృష్ణా నది కరకట్ట పనులకు రేపు సీఎం జగన్‌ శంకుస్థాపన

మరిన్ని వార్తలు