రాయలసీమ ఎత్తిపోతల: ఎల్‌-1గా ఎస్పీఎంఎల్‌

18 Aug, 2020 19:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాయలసీమ ఎత్తిపోతల టెండర్‌ను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదించింది. రూ.3,307.07 కోట్లకు కోట్‌ చేసి.. ఎల్‌-1గా నిలిచిన ఎస్పీఎమ్మెల్‌(సుభాష్‌ ప్రాజెక్ట్స్ మ్యానుఫాక్చరర్స్‌ లిమిటెడ్‌-జేవీ)కి పనులను అప్పగించడానికి మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కర్నూల్‌ జిల్లా ప్రాజెక్ట్స్ సీఈకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ఆర్‌(పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌) దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కిమీ వద్దకు ఎత్తిపోసి, తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీళ్లందించే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతలను రూపొందించిన విషయం తెలిసిందే.(రాయలసీమ ఎత్తిపోతల గురించి షెకావత్‌కు జగన్‌ లేఖ

ఈ నేపథ్యంలో ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా గత నెల 27న ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం ప్రైస్‌ బిడ్‌ను తెరిచి, ఈ-ఆక‌్షన్‌(రివర్స్‌ టెండరింగ్‌) నిర్వహించారు. ఈ ప్రక్రియలో 0.88 శాతం అధిక ధర(రూ.3,307.07 కోట్లు)కు కోట్‌ చేసిన ఎస్పీఎమ్మెల్‌(జేవీ) ఎల్‌-1గా నిలిచింది. నవయుగ, మాక్స్ ఇన్ఫ్రాలతో పోటీ పడి పనులు దక్కించుకుంది. ఈ టెండర్‌ ప్రక్రియను కర్నూల్‌ ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి ఎస్‌ఎల్‌టీసీకి పంపారు. ఈ క్రమంలో ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన మంగళవారం విజయవాడలో సమావేశమైన ఎస్‌ఎల్‌టీసీ.. రాయలసీమ ఎత్తిపోతల టెండర్‌ను ఆమోదించింది. ఎల్‌-1గా నిలిచిన ఎస్పీఎమ్మెల్‌(జేవీ)కి పనులు అప్పగిస్తూ వర్క్‌ ఆర‍్డర్‌ జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది.

మరిన్ని వార్తలు