ఏప్రిల్‌ 11న రాష్ట్ర విభజన కేసు విచారణ

23 Feb, 2023 05:34 IST|Sakshi

ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు సంబం­­ధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ త­దితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్‌ 11న వి­చా­రిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో రెండుసా­ర్లు ఎ­న్నికలు జరగడంతో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తన పిటిషన్‌లో అభ్యర్థనను మార్చారు.

రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పుల వ్యవహారాలను త్వరగా తేల్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు లబ్ధి చేకూరేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై గతేడాది నవంబరు 28న విచారణకు రాగా ఫిబ్రవరి 22న వి­చారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నెల14న సుప్రీంకోర్టు ఓసర్క్యులర్‌ జారీ చేసింది.

ఓసారి నోటీసు అయిన అంశాలను బుధ, గు­రు­వా­­రాల్లో విచారించబోమని అందులో స్పష్టంచే­సింది. దీంతో బుధవారంనాటి విచారణ జాబితా నుం­చి ఈ కేసును రిజిస్ట్రీ తొలగించారు. దీంతో ఉండ­వల్లి తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్‌ మంగళవా­రం సా­­యంత్రం కోర్టు పనివేళల ముగింపు అనంత­రం జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం ముందు ఈ అం­శాన్ని ప్రస్తావించారు.

ఈ పిటిషన్‌ను కనీసం ప­ది, ప­దిహేను రోజులు విచారించాల్సి ఉంటుంద­ని, మూ­­­డు నెలల్లో తన పదవీ విరమణ ఉందని జస్టిస్‌ జోసెఫ్‌ గుర్తుచేశారు. అన్ని రోజులు అవసరంలేదని ర­మే­శ్‌ వివరించారు. దీంతో ఏప్రిల్‌ 11న విచారణ చే­పడతామని, ఆ రోజు జాబితాలో చేర్చాలని ధర్మాస­నం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం అర్ధరా­త్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఈ ఆదేశాలు ఉంచింది.  

మరిన్ని వార్తలు