AP: ఆ విద్యార్థులకు అలర్ట్‌.. 20వ తేదీలోగా చేరాలి..

15 Jun, 2022 08:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ప్రవేశం పొందాలని ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల ఎంపిక జాబితాను ఖరారు చేసినట్లు తెలిపారు. 20వ తేదీ తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు.
చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌.. రెండు, మూడు రోజుల్లో..

మరిన్ని వార్తలు