ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌పై సుబ్రమణ్యస్వామి మరో పిటిషన్‌

3 Feb, 2022 12:01 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానెల్‌పై పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గురువారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 4వ అదనపు జిల్లా సెషన్‌ కోర్టులో ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం సుబ్రహ్మణ్యం స్వామి తరుపున సబర్వాల్ హాజరుకానున్నారు.

టీటీడీపై అసత్య కథనాలు ప్రసారంపై సుబ్రహ్మణ్యం స్వామి ఎబీఎన్‌పై రూ.100 కోట్లు పరువు నష్టం వేశారు. టీటీడీ వేసిన పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఆయన మరో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా  ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి అసత్య కథనాలు కేసుపై తన తరుపున సబర్వాల్ కోర్టుకు హాజరవుతారని పేర్కొన్నారు. శుక్రవారం కోర్టును ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

మరిన్ని వార్తలు