ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాతీయ అవార్డులు

23 Sep, 2022 20:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో మరోసారి ఏపీ సత్తా చాటింది. తిరుపతి కార్పొరేషన్‌ జాతీయ అవార్డు దక్కించుకుంది. పులివెందుల మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డు లభించింది. విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లు, పుంగనురు, సాలూరు అవార్డులు దక్కించుకున్నాయి. గత ఏడాదిలానే ఈ ఏడాది ఏపీకి ఆరు అవార్డులు దక్కాయి. అక్టోబర్‌ 2న అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌  తెలిపారు.
చదవండి: అందుకే హెల్త్‌ యూనివర్శిటికీ వైఎస్సార్‌ పేరు.. వాస్తవాలివిగో.. 

మరిన్ని వార్తలు