స్వర్ణ ప్యాలెస్‌ ఘటన స్థలానికి ఎఫ్ఎస్ఎల్ బృందం

12 Aug, 2020 14:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రైవేటు కోవిడ్ సెంటర్‌లో (స్వర్ణ ప్యాలెస్) జరిగిన అగ్నిప్రమాదం ఘటన స్థలానికి ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు బుధవారం చేరుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదంపై ఈ బృందం పూర్తి వివరాలు సేకరించనుంది. అగ్నిప్రమాదం ఎలా జరిగింది.. దానికి గల కారణాలపై కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఇప్పటికే స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని జిల్లా స్ధాయి కమిటీ పరిశీలించగా.. రాష్ట్ర స్ధాయి కమిటీ రావడంతో మరికొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. (అగ్ని ప్రమాదం ఘటన.. నిందితులకు రిమాండ్‌)

మరిన్ని వార్తలు