మంత్రి సురేష్‌కు హోం మంత్రి పరామర్శ 

31 Oct, 2022 09:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ను హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆదివారం పరామర్శించారు. ఇటీవల మంత్రి సురేష్‌కు మోకాలు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో ఉన్న సురేష్‌ను హోం మంత్రి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

మరిన్ని వార్తలు