టీడీపీ మాజీ ఎంపీ మాగంటి తనయుడు కన్నుమూత

8 Mar, 2021 04:47 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యులు, టీడీపీ సీనియర్‌ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆదివారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కాగా, రాంజీ శరీర అవయవాలను దానం చేయుటకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఏలూరులోని నివాసానికి తరలించనున్నారు.

మరిన్ని వార్తలు