సాక్షి, అమరావతి/కుప్పం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి ఉద యం 10.15 గంటలకు వరదరాజుల స్వామి దేవాలయంలోప్రత్యేక పూజలు చేస్తారు. తన పాదయాత్రను ప్రారంభిస్తూ 11.03 గంటలకు తొలి అడుగు వేయనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంలో జరిగే యువగళం సభలో పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా పీఈఎస్ కళాశాల ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్కు చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేస్తారు. తొలి రోజు పాదయాత్ర 8.5 కిలోమీటర్ల మేరక జరగనుంది. కాగా, లోకేశ్ గురువారం సాయంత్రం కుప్పం చేరుకున్నారు.