బ్యాంకుకి టోపీ పెట్టిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఫ్యామిలీ

28 Aug, 2022 17:15 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ ఉమా మహేశ్వరనాయుడు నిర్వాకం బయటపడింది. తపస్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుతో ఉమామహేశ్వరరావు సోదరులు బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకొని చెల్లించలేదు. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఉమామహేశ్వరరావు పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పొలానికి ఫ్లెక్సీలు అతికించారు. 

చదవండి: (చంద్రబాబు ‘కుప్పం’ డ్రామా హాస్యాస్పదం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి)

మరిన్ని వార్తలు