కుప్పంలో టీడీపీకి మరో షాక్‌

2 Oct, 2022 16:00 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీకి మరో షాక్‌ తగలింది. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన తర్వాత వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు నమోదవుతున్నాయి. కాగా, ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని గుడిచంబగిరికి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఈ సందర్బంగా వారికి మంత్రి పెద్దిరెడ్డి.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, ఈ కార్యక్రమంలో​ ఎమ్మెల్సీ భరత్‌ కూడా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు