Evening Top 10 Telugu News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!

22 Jul, 2022 17:53 IST|Sakshi

1. విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ డిస్‌ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. తెలుగు సినిమాలకు అవార్డుల పంట
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది.  2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు షాక్‌.. లిజ్‌ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు!
బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి కీలక ప్రకటన
వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్‌ భగవంత్ రావు వెల్లడించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్‌ పాలిట్రిక్స్‌ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి!
తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగలనుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికపై పరోక్షంగా సంకేతాలు అందించారు ఆయన. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఇంగ్లండ్‌లో క్రికెట్‌ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి
టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌లోని లీస్టర్‌షైర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌కు 'గవాస్కర్‌ గ్రౌండ్‌'గా నామకరణం చేశారు. రిపోర్ట్స్‌ ప్రకారం ఇంగ్లండ్‌ లేదా యూరప్‌ గడ్డపై ఉన్న క్రికెట్‌ గ్రౌండ్‌కు ఒక ఇండియన్‌ క్రికెటర్‌ పేరు పెట్టడం ఇదే తొలిసారి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ‘కలర్‌ ఫోటో’కు జాతీయ అవార్డు.. హీరో సుహాస్‌ ఏమన్నాడంటే..
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. మూడు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్‌ ఫోటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు లభించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మోస్ట్‌ పవర్‌ఫుల్‌ హోండా 2023 సివిక్‌ టైప్‌-ఆర్‌ ఆవిష్కారం
హోండా  కొత్త సివిక్‌ వాహనాన్ని లాస్ ఏంజిల్స్‌లో గ్లోబల్‌గా ఆవిష్కరించింది. ‘హెండా సివిక్‌ టైప్-ఆర్‌ 2023’ను  పరిచయం చేసింది. త్వరలోనే    వీటి ధరలు,  ఫీచర్లు వెలుగులోకి రానున్నాయి.   30 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన ఆర్‌ బ్రాండెడ్‌ మోడల్‌ అని హోండా వెల్లడించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు