అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత

19 Jun, 2022 16:26 IST|Sakshi

సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారంటూ సర్వేయర్‌ను అయ్యన్న అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో అయ్యన్న అనుచరులకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన వారు ఆవేశంతో ఊగిపోయారు. అనంతరం.. పోలీసులతో అయ్యన్న అనుచరులు వాగ్వాదానికి దిగారు. 

ఇది కూడా చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు

మరిన్ని వార్తలు