అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్‌

28 Oct, 2020 15:15 IST|Sakshi

అనంత‌పురం : త‌మ కళాశాలకు అనుమతి ఇవ్వకుంటే అంతుచూస్తామని అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. విద్యా ప్రమాణాల దృష్ట్యా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నిబంధనలను  ప్రభుత్వం  కఠినతరం చేసింది. ఈ నేప‌థ్యంలో దాదాపు  ఐదు జిల్లాల్లోని  63 ఇంజినీరింగ్‌ కాలేజీల అనుమతులు ప్రశ్నార్ధకంగా మారాయి. దీంతో త‌మ కాలేజీల‌కు అనుమ‌తులు ద‌క్క‌వేమోన‌ని కొంద‌రు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు బెదిరింపులు పాల్ప‌డుతున్న‌ట్లు అధికారుల దృష్టికి వ‌చ్చింది. 
 

మరిన్ని వార్తలు