ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

9 Mar, 2021 07:33 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామకృష్ణ(42), అతని భార్య రాజేశ్వరి(35), కుమారుడు యోగేశ్వర్(12) ఆత్మహత్య చేసుకున్నారు. తలుపు పగులగొట్టి మృతదేహాలను  గ్రామస్తులు వెలికితీశారు. ఘటనపై పోలీసులు విచాణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

మరిన్ని వార్తలు