పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి!

18 Feb, 2023 15:57 IST|Sakshi

సాక్షి, ఏలూరు: పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. 

వివరాల ప్రకారం.. శివరాత్రి పండుగ వేళ ఏలూరులో విషాదం నెలకొంది. గోదావరిలో ఏడుగురు స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా దోసపాడు వాసులుగా గుర్తించారు. 

మృతుల వివరాలు ఇవే.. 
- ఓలేటి అరవింద్ (20)
- ఎస్‌కే లక్ష్మణ్‌ (19)
- పెదిరెడ్డి రాంప్రసాద్ (18). 

మరిన్ని వార్తలు