విశాఖ జూ పార్కులో పులి మృతి

17 Oct, 2021 05:20 IST|Sakshi
మృతి చెందిన పులి సీత (ఫైల్‌)

ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ జూ పార్కులో ఓ ఆడ పులి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయసు గల ఈ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌(సీత) వృద్ధాప్యంతో పాటు కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది.

ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం పులుల ఎన్‌క్లోజర్‌లో మృతి చెందింది. యానిమల్‌ కీపర్‌ ద్వారా విషయం తెలుసుకున్న జూ అధికారులు పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.  

మరిన్ని వార్తలు