సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు

21 Sep, 2020 13:45 IST|Sakshi

సాక్షి, తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం సింహవాహనంపై యోగ ముద్రంకిత స్వరూపంలో మలయప్పస్వామి  భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. సింహం అంటే ముందుగా నరసింహ అవతారమే సాక్షత్కరిస్తుంది. భక్తుల మదిలో వెంకటాద్రి రాజసింహం మృగరాజుపై యోగముద్రంకిత స్వరూపంతో దర్శనమిచ్చారు. కాగా ప్రపంచాన్ని గజ గజలాడిస్తున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల చరిత్రలోనే ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు