సెప్టెంబ‌ర్ 19 నుంచి 27 వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు

26 Aug, 2020 19:20 IST|Sakshi

సాక్షి, తిరుప‌తి: సెప్టెంబరు మాసంలో తిరుమలలో విశేష పర్వదినాలు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 1న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం, 17న మహాలయ అమావాస్య ఉంది. 18వ తేదీన‌ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జ‌రుగ‌నుంది. ఆ త‌ర్వాతి రోజు అంటే సెప్టెంబరు 19న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి. 23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జా‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్త‌వుతాయి. ఇక‌ సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం జ‌రుగుతుంది. (చ‌ద‌వండి: దర్శనాలకు ఆటంకం ఉండదు: వైవీ సుబ్బారెడ్డి)

చ‌ద‌వండి: వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు

మరిన్ని వార్తలు