మదనపల్లె సిటీ (చిత్తూరు జిల్లా): టమాటా ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్లో శనివారం మొదటి రకం టమాటా కిలో రూ.74 పలికింది. గతంలో ఎన్నడూలేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాంతాల్లో టమాటా పంట దెబ్బతింది.
దీంతో ధరలు పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్కు కేవలం 157 మెట్రిక్ టన్నుల సరకు మాత్రమే వచ్చింది. సరుకు తక్కువ రావడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధరలు మరింత పుంజుకుంటున్నాయి.