మదనపల్లె సిటీ: టమటా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మార్కెట్కు సరుకు తక్కువగా వస్తుండడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్లో శుక్రవారం టమాటా ధర గరిష్టంగా కేజీ రూ.104 పలికింది. కేవలం 92 మెట్రిక్ టన్నుల సరుకు మాత్రమే మార్కెట్కు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో పాటు శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండడంతో టమాటాకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి.