తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..

14 Nov, 2021 12:28 IST|Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో స్వామివారి దర్శనానికి ఎక్కువ మంది భక్తులను అనుమతించనున్నట్టు ఆయన వెల్లడించారు.

ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారు. కరోనా తగ్గుముఖం పడుతోంది. అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌ లోనా.. లేదా ఆఫ్‌ లైనా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామ’ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

చదవండి: (Andhra Pradesh: రాష్ట్ర ప్రయోజనాలే అజెండా)

మరిన్ని వార్తలు