యాడ్‌ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ: సుబ్బారెడ్డి

30 Jul, 2020 20:36 IST|Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో కరోనా బారిన పడిన అర్చకులందరూ కోలుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల దర్శనాల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని చెప్పారు.

ఎస్వీబీసీని యాడ్‌ ఫ్రీ ఛానల్‌గా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాతల విరాళలతో ఎస్వీబీసీ ఛానల్‌ను నడుపుతామన్నారు. హిందీ, కన్నడ భాషల్లో కూడా ఎస్వీబీసీ ప్రాసారాలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవ సేవను నిర్వహిస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు