తిరుమల: రేపు ఆన్‌లైన్‌లో వర్చువల్‌ సేవ టికెట్లు

6 Aug, 2021 21:25 IST|Sakshi

సాక్షి, తిరుమల: వర్చువల్‌ సేవ టికెట్లను ఆగస్టు 7న ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు గల వర్చువల్‌ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. వీటితో పాటు ఈనెల 30, 31 తేదీలకు సంబంధించిన వర్చువల్ సేవ టికెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. శనివారం ఉదయం 11 గంటల నుంచి టికెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు టీటీడీ తెలిపింది.  

మరిన్ని వార్తలు