తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన ముప్పు

18 Nov, 2022 04:48 IST|Sakshi
గద్వాల స్టేషన్‌లో నిలిచిపోయిన రైలు

కర్నూలు (రాజ్‌విహార్‌): కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ (17024)కు ముప్పు తప్పింది. గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు రైలు కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరింది. గద్వాల స్టేషన్‌ వద్ద రైలు ఇంజన్‌కు ఉన్న లింక్‌ హుక్‌ తెగిపోవడంతో బోగీలు విడిపోయాయి.

అప్రమత్తమైన లోకో పైలెట్‌ రైలును నెమ్మదించి ఆపై నిలిపివేశారు. దీంతో ఇంజన్‌ సుమారు 10 మీటర్ల దూరం వెళ్లి నిలిచిపోయింది. రైల్వే అధికారులు మరో ఇంజన్‌కు బోగీలను అమర్చి పంపించారు. దీంతో రైళ్ల రాకపోకలకు గంటకు పైగా అంతరాయం ఏర్పడింది. 

మరిన్ని వార్తలు