కొనసాగుతున్న ద్రోణి

27 Apr, 2021 03:48 IST|Sakshi

రాష్ట్రంలో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు  

ఉత్తర కోస్తాలో ఈదురుగాలులు 

మహారాణిపేట(విశాఖ దక్షిణ):  ద్రోణి, ఉపరితల ఆవర్తనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. బిహార్‌ తూర్పు ప్రాంతాల నుంచి జార్ఖండ్, ఒడిశా, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి వ్యాపించి ఉందని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంత పరిసరాల మీద ఉపరితల ఆవర్తనం ఉందని, వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇదే సమయంలో ఉత్తర కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని పేర్కొంది.  

మరిన్ని వార్తలు