సీఎంకు నిరుద్యోగ జేఏసీ  కృతజ్ఞతలు

26 May, 2023 09:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రూప్‌–1, గ్రూప్‌­–2­లో 1,000 పోస్టుల భర్తీకి అనుమతించిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్‌ కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ బదిలీలకు అవకా­శం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో సచివాలయాల్లో చేపట్టినట్టే భారీ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు. ఇటీవల పరీక్షలు రాసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోని దోషా­లను అధిగమించేలా గ్రేస్‌ మార్కులు ఇవ్వా­లని అభ్యర్థించారు.

(చదవండి: ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే...)

మరిన్ని వార్తలు