పశ్చిమ గోదావరిలో దారుణం.. ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు

19 Aug, 2021 09:52 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న జగనన్న కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటికి నిప్పుపెట్టారు. నిప్పుపెట్టిన సమయంలో ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు సకాలంలో మంటలార్పటంతో నలుగురికి ప్రాణహాని తప్పింది. సమామచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు