గుర్తింపు లేని డిగ్రీ కాలేజీల అడ్మిషన్ల నిలిపివేత

27 Aug, 2021 02:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉన్నత విద్యామండలి ప్రకటన

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల గుర్తింపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 40 ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల అడ్మిషన్లను 2021–22 విద్యాసంవత్సరానికి నిలిపివేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

యూనివర్సిటీల గుర్తింపు లేకపోవడం, మూడేళ్లుగా ఎలాంటి అడ్మిషన్లు కూడా చేయకపోవడంతో ఈ  నిర్ణయం తీసుకున్నారు. అలాగే 257 కాలేజీల్లో విద్యార్థుల చేరికలు లేని 454 ప్రోగ్రాముల్లో కూడా ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాలేజీలకు నోటీసులు జారీచేశామని, నెలరోజుల్లో ఆయా యాజమాన్యాలు తమ వివరణలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు