విశాఖ: వందే భారత్‌పై ఆకతాయిల దాడి.. రైలు ఆలస్యం

4 Feb, 2023 11:26 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మూడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఖమ్మం వద్ద రైలు భోగి సి-12 కోచ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో..

ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ విండో పగిలిపో​యింది. ఆ కోచ్ అద్దాలను మార్చడంతో రైలు బయలుదేరడం ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. రైలు కోచ్ సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు పోలీసులు. వాళ్లను ట్రేస్‌ చేసే పనిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు