వాహన పన్ను చెల్లింపు గడువు పొడిగింపు

27 Apr, 2021 08:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: మోటారు వాహన పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం జూన్‌ 30 వరకు పొడిగించింది. ప్రస్తుత త్రైమాసిక పన్నును ఏప్రిల్‌ 30లోగా చెల్లించాల్సి ఉంది. కాగా, కరోనా తీవ్రత నేపథ్యంలో పన్ను చెల్లింపు తేదీని పొడిగించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పన్ను చెల్లింపు గడువును జూన్‌ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: కరోనా: ప్రయాణికులు లేకపోవడంతో  10 రైళ్లు రద్దు   
ఏపీ: వాహన విక్రయాల్లో జోష్‌

మరిన్ని వార్తలు