24 గంటల్లో 9,779 మంది డిశ్చార్జ్‌ 

15 Aug, 2020 05:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ వైరస్‌ బారిన పడిన బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 66.17 శాతంగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 8,943 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 9,779 మంది కోలుకున్నారు. మొత్తం 97 మంది మృతిచెందారు. అలాగే, శనివారం ఉదయం నాటికి 24 గంటల్లో 53,026 టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,73,085 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీరిలో 1,80,703 మంది పూర్తిగా కోలుకున్నారు. 89,907 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మృతుల సంఖ్య 2,475కు చేరింది. రాష్ట్రంలో 27,58,485 టెస్టులు చేశారు. 

మరిన్ని వార్తలు