అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు

29 Oct, 2022 09:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.వి.విజయబాబును ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రంలో అధికారిక, పరిపాలన కార్యకలాపాలు తెలుగు భాషలో కొనసాగే విధంగా పర్యవేక్షించడంతో పాటు తెలుగు భాషా ప్రగతికి సిఫారసులు, సూచనలు చేయాల్సి ఉంటుంది.
చదవండి: పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ  

మరిన్ని వార్తలు