‘అరగుండు పాత్రుడు నీ కోరికలేమిటో అందరికీ తెలుసు’

25 Nov, 2022 21:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేతల ఓవరాక్షన్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్త​ం చేశారు. ట్విట్టర్‌ వేదికగా విజయసాయిరెడ్డి.. టీడీపీ నేతలపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, ట్విట్టర్‌లో ‘అరగుండు పాత్రుడు దేవుడి దగ్గరా డ్రామాలేస్తే టెంకాయ పగిలిపోతుంది. నీ కోరికలేమిటో అందరికీ తెలుసు. బడుద్దాయి కొడుకుని నర్సీపట్నంలో గెలిపించాలి. వైజాగ్ రాజధాని కాకుంటే ఖనిజాలు దోచుకున్నా, భూములు ఆక్రమించినా ఎవరి దృష్టీ పడదు. ఉత్తరాంధ్ర పేదరికం అలాగే ఉండాలని కోరుకున్న గంజాయి పాత్రుడు.

బోండం ఒరిజినల్ బిజినెస్ చిత్తు కాగితాలు ఏరుకోవడం. దుర్గగుడి దగ్గర సైకిల్ బెల్లులు కొట్టేసిన డబ్బుతో కాల్ మనీ వ్యాపారం చేసే బోండం, నర్సీపట్నంలో గంజాయి అరగుండు పాత్రుడు, దెందులూరులో కోడిపందాల కాంతారావు వంటి స్క్రాప్ ను పెంచి పోషించిన దుర్మార్గం 40ఏళ్ల ఇండస్ట్రీ తుప్పుదే’ అన్నారు. 

ఈ నాలుగింటిలో బొల్లి బాబు ఏ రకం?
1)అధికారం మా చేతిలోనే ఉండాలి.
2)అసమర్థుడైనా పప్పే సీఎం కావాలి.
3)కుల దైవం డ్రామోజీకి బతికుండగానే ఊరూరా గుళ్ళు కట్టించాలి. 
4)వ్యవస్థలన్నిటిలో మావాళ్లే ఉండాలి.

మరిన్ని వార్తలు