విజయవాడ: ఏపీలోని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సాయుధ దళాల నుంచి సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా కరోనా దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులకు ఆహ్వానం పంపించారు. పాస్లు ఉన్నవారికే వేడుకలకు అనుమతించనున్నారు.