గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకున్న సీఎం జగన్‌

18 Jun, 2022 07:54 IST|Sakshi
సీఎం జగన్‌ను కలిసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రతినిధులు తదితరులు  

సాక్షి, అమరావతి: చెప్పిన మాట ప్రకారమే జూన్‌ నెలాఖరుకల్లా అర్హులైన ‘సచివాలయ’ ఉద్యోగుల ప్రొబేషన్‌ను డిక్లేరు చేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన గొప్పతనాన్ని మరోసారి నిరూపించుకున్నారని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కొనియాడింది. ‘సచివాలయ’ ఉద్యోగ ప్రతినిధులు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలçహాదారు ధనుంజయరెడ్డి, అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.   

చదవండి: (AP: 8,000 పోస్టులు సత్వరం భర్తీ)

మరిన్ని వార్తలు