వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి ఉత్సవాలు

10 Sep, 2021 11:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. గణపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై చవితి ఉత్సవాలు ప్రారంభం..
విజయవాడ: 
ఇంద్రకీలాద్రిపై వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విఘ్నేశ్వర పూజ అనంతరం కలశస్థాపన, విశేషపపత్రి పూజ నిర్వహించారు. రెండో రోజు మండప పూజ, గణపతి హోమం, తీర్థ ప్రసాదాల వితరణ చేయనున్నారు. మూడో రోజు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.

ఇవీ చదవండి:
ఏపీ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

>
మరిన్ని వార్తలు